English | Telugu

గుంటూరు లో మాస్క్ లేకుండా తిరిగితే వెయ్యి రూపాయల ఫైన్

గుంటూరు జిల్లాలో లాక్ డౌన్ ను మరింత కఠిన తరం చేస్తున్నట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. మాస్క్ లు లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల ఫైన్ వేయనున్న అదికారులు. ఉదయం 6 గంటలనుండి 9 గంటలవరకు మాత్రమే కర్యూ సడలింపు. 9 గంటల తరువాత వాహనం కనబడితే సీజ్ చేస్తామని, ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపించి కలెక్టరేట్ లో పాస్ పొందాలని అధికారులు సూచించారు. ఉద్యోగస్తుల వాహనాలు ఉదయం పదిగంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయట కనబడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 5 గంటలనుండి 7 గంటల వరకు ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తున్నామన్నారు.