English | Telugu
మార్చి 15న ప్రారంభం కానున్న సల్మాన్-పూజా 'భాయీజాన్'
Updated : Feb 8, 2022
సల్మాన్ ఖాన్ హీరోగా నటించే 'భాయీజాన్' సినిమా షూటింగ్ మార్చి 15న ప్రారంభం కానున్నది. ఇదివరకు ఈ సినిమాకు 'కభీ ఈద్ కభీ దీవాళీ' అనే టైటిల్ పెట్టి, తర్వాత 'భాయీజాన్'గా మార్చారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించే ఈ సినిమాని సాజిద్ నదియడ్వాలా నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి రాకముందే ఈ సినిమాకు సల్మాన్ సంతకం చేశాడు. ఇంత కాలానికి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తోంది. Also read: హృతిక్ తో డేటింగ్.. మాస్క్ పెట్టుకున్న ఆ బ్యూటీని గుర్తుపట్టారా?
ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఒక లావిష్ సెట్ను నిర్మించారు. 'హౌస్ఫుల్ 3', 'హౌస్ఫుల్ 4' సినిమాలను రూపొందించి, ప్రస్తుతం అక్షయ్కుమార్తో 'బచ్చన్ పాండే'ని డైరెక్ట్ చేస్తోన్న ఫరాద్ సంజీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. అతను గతంలో సింగమ్, బాఘీ 3, సూర్యవంశీ, కూలీ నం.1 సినిమాలకు రైటర్గా పనిచేశాడు. Also read: #NTR30 ముహూర్తం వాయిదా.. యాక్సిడెంటే కారణమా?
సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటించే ఈ సినిమాలో హీరో తమ్ముళ్లుగా జహీర్ ఇక్బాల్, అసీమ్ రియాజ్ కనిపించనున్నారు. ఇది తమిళ హిట్ ఫిల్మ్ 'వీరమ్'కు రీమేక్ అని సమాచారం. తను పెళ్లిచేసుకుంటే, పెద్దదైన తమ కుటుంబానికి అది సమస్యగా మారుతుందని భావించే పెద్దన్నగా సల్మాన్ నటించనున్నాడు. అతనికి సంబంధం చూసి, ఎలాగైనా పెళ్లి చేయాలని తమ్ముళ్లు చూస్తుంటారు. సల్మాన్, పూజా జంటగా నటిస్తున్న తొలి సినిమా ఇదే. 2023 ఈద్కు 'భాయీజాన్'ను విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.