English | Telugu

2022లో సెన్సేష‌న‌ల్‌ 'మీర్జాపూర్ 3' రానున్న‌దా?

2022లో సెన్సేష‌న‌ల్‌ 'మీర్జాపూర్ 3' రానున్న‌దా?

 

'మీర్జాపూర్' ఫ‌స్ట్ సీజ‌న్ రిలీజైన‌ప్పుడు దాన్ని చూసిన‌వాళ్లంతా అమితాశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఇండియ‌న్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వ‌చ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌ల‌లో ఒక‌టిగా దానికి గుర్తింపునిచ్చారు. ఇక రెండో సీజ‌న్ అయితే మ‌రింత బాగా ఆడియెన్స్ అల‌రించి, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్‌ల‌లో అత్య‌ధిక వీక్ష‌కాద‌ర‌ణ పొందిన సిరీస్‌ల‌లో ఒక‌టిగా నిలిచింది. అలీ ఫ‌జ‌ల్‌, పంక‌జ్ త్రిపాఠి, దివ్యేందు, శ్వేతా త్రిపాఠి, ర‌సికా దుగ‌ల్, విజ‌య్ వ‌ర్మ‌ న‌ట‌న ఆడియెన్స్‌కు బాగా న‌చ్చేసింది. ఇవాళ 'మీర్జాపూర్‌'కు క‌ల్ట్ స్టేట‌స్ వ‌చ్చేసింది. ఆ రెండు సీజ‌న్ల మ‌ధ్య గ్యాప్ ఎక్కువ‌గా వ‌చ్చింది. 

ఈ సిరీస్‌కు మూడో సీజ‌న్ వ‌స్తుంద‌ని రెండో సీజ‌న్ ఎండింగ్‌తోటే అంద‌రికీ అర్థ‌మైపోయింది. అయితే మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆ సిరీస్ షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా, త‌మ ముందుకు ఎప్పుడు వ‌స్తుందా అనే ఆత్రుత జ‌నంలో పెరిగిపోయింది. లేటెస్ట్‌గా దీని గురించి ప్రొడ్యూస‌ర్ రితేశ్ సిధ్వానీ కొంత స‌మాచారం ఇచ్చాడు. "ప్ర‌స్తుతం స్క్రిప్టుపై వ‌ర్క్ చేస్తున్నాం. నిజానికి ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ చెయ్యాల‌నుకున్నాం. లాక్‌డౌన్ వ‌ల్లా, షూటింగ్ నిబంధ‌న‌ల వ‌ల్లా, వ‌ర్షాల వ‌ల్లా ఇంత‌దాకా వీల‌వ‌లేదు. క‌చ్చితంగా వ‌చ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేస్తాం." అని ఆయ‌న చెప్పాడు.

సో.. ప్రొడ్యూస‌ర్ మాట‌ల్ని బ‌ట్టి అలీ ఫ‌జ‌ల్‌, పంక‌జ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ధారులైన 'మీర్జాపూర్ 3' 2022లో మ‌న‌ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌న్న మాట‌.