భూమి పుత్రుడు

దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్స మత్స్యవల్లభుడనే రాజుకు వీపుమీద రాచపుండు ఏర్బడింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా, ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు.

Aug 21, 2024

నిజాల వేట!

మహారాజు సింహాసనం అధిష్టించి పది సంవత్సరాలు పూర్తి అయింది. దాంతో తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. అంగరంగ వైభవంగా సమావేశం ఏర్పాటు చేశాడు. సామంతులు, సైన్యాధికారులు, వ్యాపారులు, కళాకారులు, పుర ప్రముఖులు అందరినీ ఆహ్వానించాడు.

Aug 19, 2024

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం అంటేనే నోములు వ్రతాలు గుర్తొస్తాయి. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

Aug 16, 2024

మంచితనం

సుమంతపురంలో నారాయణ పండితుడు, శివ పండితుడు అని ఇద్దరు విద్యావంతులు ఉండేవారు. వారు శత్రువులు కాదు మిత్రులు కారు. ఇలా ఉండగా ఆ ఊరి ఆలయానికి అర్చకుని అవసరం కలిగింది.

Aug 13, 2024

గంగా స్నానం.. విశ్వాసం

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది.

Aug 12, 2024

రాము తెలివి

పార్వతీపురంలో కార్లు అమ్మే దుకాణం తెరుద్దామని వ్యాపారవేత్త సుందరం అనుకున్నాడు. ఆ వ్యాపారం చూసుకోడానికి ఆయన కొడుకు వివేక్ అంగీకరించడంతో తగిన ఏర్పాట్లు చేసాడు.

Aug 8, 2024

అనుకరణ

“అమ్మా .. దీన్ని తలకి అతికిస్తే తల పగిలిపోవడం తగ్గిపోతుంది. ఇదిగో తీసుకుని అతికించు” అని గుండ్రంగా ఉన్న ప్లాస్టర్ రీలు తెచ్చిచ్చాడు నాలుగేళ్ల రవి. “ తలనొప్పి తగ్గడానికి దీన్ని అతికించమని ఎవరు చెప్పారు” అడిగింది రజని ఆశ్చర్యంగా. వాడేమి చెప్పాడో సరిగా అర్ధం కాకపోవడంతో.

Aug 5, 2024

రాజుగారి కళా పోషణ

విజయనగర రాజు విజయేంద్రవర్మ మంచి ఇంద్రజాలికుడు. ఎక్కడికి వెళ్ళినా, కళల గురించి గొప్పగా మాట్లాడేవాడు. ఒకసారి తన రాజ్యంలో కళాకారులు ఎంత గొప్పగా జీవిస్తున్నారో, గౌరవించబడుతున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది.

Aug 1, 2024

శంకు కర్ణుడి కథ

వ్యాస మహర్షి శిష్యులతో కలసి కాశీ నగరంలో ఉన్న కాలంలో ప్రతిరోజూ అక్కడి తీర్థాలను, ఆలయాలను సందర్శించసాగాడు. ఒకనాడు కృత్తివాసేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలసి కపర్దీశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరాడు.

Jul 31, 2024

అల్లుడి అదృష్టం

భద్రయ్యకూతురు సీత పెళ్ళి కుదిరింది. ఊళ్ళోనేవున్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్ళి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తనువుంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు.

Jul 29, 2024

ఆలోచన-ఆచరణ (చందమామ కథలు)

ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే, గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యమూ గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్లి వస్తూండేవారు. గ్రామానికీ ఏటి గట్టుకూ నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటిచెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడూ కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు.

Jul 25, 2024

మంచి మాట

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు.

Jul 18, 2024

సంతృప్తి

ఒక రాజ్యంలో ఓ అత్యంత తెలివైనవాడుండేవాడు. అతని పేరు సుబ్బన్న. తెలివైనవాడే కానీ తృప్తి, ఆనందం అనే మాట తెలీని వాడు. ఎవరిని చూసినా తానే వాడికంటే గొప్ప అనుకునే నైజం. దీంతో సుబ్బన్న అహంభావి అనేవారు కొందరు. ఇవేమీ పట్టించుకునేవాడు కాదు సుబ్బన్న.

Jul 13, 2024

సింహము- చిట్టెలుక

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలుపై ఎక్కింది.

Jul 6, 2024

ఎవరు గొప్ప దాత ?

మహా భారతంలో ఎన్నో సంఘటనలు, ఉంటాయి. ప్రతి కథా మన జీవితానికి ముఖ్యమయిన ఎన్నో విషయములను మనకు తెలియ చేస్తుంది. వాటిలో ఒకటి సక్తుప్రస్తుడు కథ.

Jul 3, 2024

స్వార్థంలో నిస్వార్థం (విక్రమాదిత్య కథలు)

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.

Jun 25, 2024

రాజుగారి బావమరిది (చందమామ కథ)

ఒకానొకప్పుడు మహాసేనుడనే రాజు భారతదేశం అంతా జయించి చక్రవర్తి అయ్యాడు. మహాసేనుడికి ఓడిన రాజులందరూ అతనికి సామంతులై, అతని నిర్ణయాలను బట్టి పరిపాలించసాగారు. సామ్రాజ్యం స్థాపించటానికి ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ మహాసేనుడు ప్రజాకంటకుడు కాడు. పైగా, ప్రజాక్షేమం గురించి ఆయన చాలా శ్రద్ధగా ఆలోచించేవాడు. అందుకొరకు అనేక ప్రణాళికలు వేసి, సామ్రాజ్య మంతటా అమలు జరిపించేవాడు.

Jun 24, 2024

ప్రాణాధారం నీరు

గడపలో వాలు కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్న సీతారాం గారి ఇంటి ముందు మంచినీళ్ల బాటిల్స్ వ్యాన్ ఆగింది. ఒక కుర్రాడు వచ్చి ఇరవై లీటర్లున్న బాటిల్ అరుగు మీద పెట్టి వెళ్లిపోయాడు.

Jun 19, 2024

దివ్యస్త్రోత్రం

ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.

Jun 17, 2024

తిరిగొచ్చిన సాయం

శృంగవరం ప్రక్కనే ఉన్న దట్టమైన అడవుల్లో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసేవాడు ముని శతానందుడు. ఆ ఆశ్రమం చుట్టూ ఎన్నో పూల మొక్కలు, పండ్ల చెట్లు, పొదలు పెరిగాయి. అడవిలో కంటే ముని ఆశ్రమం చుట్టూ బాగుండడంతో ఆ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడ్డాయి జంతువులు. అక్కడకు వచ్చి విశ్రాంతి తీసుకునేవి.

Jun 13, 2024