ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తారా? ధర్నా చేయమంటారా?.. అంబటి
posted on Oct 24, 2015 4:32PM
.jpg)
ఆర్టీసీ చార్జీల పెంపుదలపై వైకాపా నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఆర్టీసీ చార్జీలను 10 శాతం పెంచినట్టు గత రాత్రి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా.. దానివల్ల డీజిల్ ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతుందో అర్ధంకావట్లేదు అని అన్నారు. ఆర్టీసీని నడిపే సామర్ధ్యం ఏపీ ప్రభుత్వానికి లేకపోవడంవల్లే ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. అంతేకాదు రేపటి కల్లా ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తున్నామని నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే ఎల్లుండి అంటే 26 వ తేదీన జగన్ చెప్పినట్టు అన్ని ఆర్టీసీ డిపోల ముందు ధర్నాలు చేస్తామని చెప్పారు. కావాలనే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని.. ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఎక్కుతారని.. ప్రైవేటు సంస్థలన్నీ చంద్రబాబు, ఇతర నాయకులకు బినామీ సంస్థలేనని ఆరోపించారు.