టీడీపీలోకి వైఎస్ నీడ సూరీడు!!
posted on Feb 25, 2019 3:05PM

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వింటే ఠక్కున ఇద్దరు వ్యక్తుల పేర్లు గుర్తొకొచ్చేవి. ఒకటి వైఎస్ ఆత్మ కేవీపీ.. రెండు వైఎస్ నీడ సూరీడు. వైఎస్ మరణాంతరం కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగుతూ అప్పుడప్పుడు మీడియా ముందు కనిపిస్తూ వైఎస్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక సూరీడు విషయానికొస్తే.. అప్పట్లో ఎప్పుడూ వైఎస్ పక్కనే ఉంటూ వైఎస్ నీడగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. వైఎస్ మరణానంతరం తెర చాటుకు వెళ్లిపోయారు. కారణాలేంటో తెలీదు కానీ ఆయన వైఎస్ కుటుంబానికి, సన్నిహితులకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు సూరీడు పేరు తెరమీదకు వచ్చింది. ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నారట. మంత్రి ఆదినారాయణ రెడ్డి రంగంలోకి దిగి పావులు కదిపారట. సూరీడు కూడా టీడీపీలో చేరడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లో ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వైఎస్ జగన్ కి గట్టి దెబ్బ అనే చెప్పాలి. వైఎస్ బ్రతికున్నప్పుడు వైఎస్ నీడగా పేరుతెచ్చుకున్న సూరీడు.. వైసీపీని కాదని టీడీపీలో చేరితే.. వైఎస్ అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.