జగన్ పార్టీ కమిటీలో కొణతాల శోభాలకు చోటు

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్రమశిక్షణా కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలను ప్రకటించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌గా కొణతాల రామకృష్ణను నియమించింది. అందులో సభ్యులుగా శోభా నాగి రెడ్డి, సోమయాజులు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఉన్నారు. క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా రామకృష్ణంరాజును సభ్యులుగా రఘురామి రెడ్డి, రవీంద్ర నాయక్, బుచ్చి మహేశ్వర రావులను నియమించారు. రైతు విభాగం కన్వీనర్‌గా ఎంవిఎస్ నాగినీడును నియమించారు. కాగా జగన్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే అంశంపై ప్రధానంగా దృష్టి సారించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu