యోగాలో బాబా రాందేవ్ను మించిపోయిన యోగి
posted on Jun 7, 2017 11:20AM
.jpg)
భారతదేశంలో యోగాకి కేరాఫ్ అడ్రస్ అంటే బాబా రాందేవ్ అనే చెప్పాలి. మరుగున పడిపోతున్న యోగాకి తిరిగి పునర్ వైభవాన్ని తీసుకురావడంతో రాందేవ్ కీలకపాత్ర పోషించారు. అలాంటి బాబా రాందేవ్కు చెమటలు పోయించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అందుకు సన్నాహకంగా లక్నోలోని రాజ్భవన్లో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ రాంనాయక్ పాల్గొన్నారు. రాందేవ్తో పోటిపడి మరి యోగాసనాలు వేశారు యోగి..కాగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్నోలో 50 వేల మందితో కలిసి ప్రధాని నరేంద్రమోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్లు యోగాసనాలు వేయనున్నారు.