బాబ్రీకేసులో బీజేపీ నేతలకు తాత్కాలిక ఊరట

వివాదాస్పద బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, సమురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతిలకు సీబీఐ కోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరు లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బాబ్రీ కేసుపై విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగ్గురు నేతలు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వీరు పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అందుకు అంగీకారం తెలిపింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu