రజతం నుండి స్వర్ణానికి యోగేశ్వర్ దత్...
posted on Sep 3, 2016 4:07PM

సాధారణంగా నక్క తొక్కితే అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. కానీ భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ కి మాత్రం అలాంటి తోకలు ఏం తొక్కకుండానే అదృష్టం కలిసివచ్చింది. ఇటీవలే అదృష్టవశాత్తు లండన్ ఒలింపిక్స్- 2012 లో కాంస్య పతకం సాధించిన యోగేశ్వర్ దత్ సిల్వర్ పతకం సాధించాడు. ఆ ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన రష్యా రెజ్లర్ బెసిక్ కుద్ కోవ్ డోపింగ్ కు పాల్పడ్డాడని తేలడంతో తాను సాధించిన రజత పతకాన్ని యోగేశ్వర్ దత్ కి ప్రధానం చేశారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. అదే ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన అజర్ బైజాన్ రెజ్లర్ తోగ్రుల్ అస్గరోవ్ కూడా డోపీయేనని తేలింది. దీంతో ఇంకేముంది అతనిపై కూడా వేటు పడనుంది. దాంతో పాటు అతను సాధించిన స్వర్ణ పతకం యోగేశ్వర్ దత్ కు దక్కనుంది. ఈ విషయమై అధికారిక ప్రకటన కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య ఎదురుచూస్తోంది.