కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం... వైసీపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..
posted on May 3, 2016 11:12AM

ఒక పక్క వైసీపీ నేతలు పార్టీ మారుతూ జగన్ కు గుబులు పుట్టిస్తుంటే.. ఇప్పుడు కొంతమంది నేతలు తీరు ఆయనకు తలనొప్పిగ తయారయ్యేట్టు ఉంది. గతంలో విమానాశ్రయంలో ఒక మేనజర్ పై చేయిచేసుకున్నారని వైసీపీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు మరోసారి..మిథున్ రెడ్డిపై కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కాంట్రాక్టర్ శరత్ చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి ఆదేశాలతో తాను ఓ పని చేశానని .. అందుకైన బిల్లులు రూ.32 లక్షలను వారు తనకివ్వలేదని ఆరోపించారు. దీంతో తాను వైసీపీ కార్యలయం ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన పిర్యాదుతో మిథున్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.