కేసినో.. బాలికతో వ్యభిచార*.. వైసీపీ నేత‌ల అరాచ‌కం..

ఛీ.. ఛీ.. కొంద‌రు వైసీపీ నేత‌ల‌ను ఏం చేసినా పాపం లేదు. ఏపీని భ్ర‌ష్టు పట్టిస్తున్నారు దుర్మార్గులు. ఇప్ప‌టికే కేసినోతో క‌ల‌క‌లం రేప‌గా.. తాజాగా ఓ బాలిక‌తో వ్యభిచార* చేయించిన పాపిష్టి ప‌నిలోనూ అధికార పార్టీ నేత‌లే ఉండ‌టం వారి అరాచ‌కాల‌కు నిద‌ర్శ‌నం. 

వైసీపీ నేతలు చేస్తున్న అడ్డగోలు డబ్బుల దందాలకు అంతూ.. దరీ లేకుండా పోతోంది. కెసినో, అపైన బాలికతో వ్యభిచారం చేయించేంత నీచానికి కూడా అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన మీడియా కథనం ప్రకారం.. మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రైట్ హ్యాండ్ భూశంకరరావు వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడం సంచలనం అవుతోంది. కాసుల కోసం కక్కుర్తి పడి వైసీపీ నేతలు ఎంతకైనా తెగించేస్తారా? అంటూ పబ్లిక్ నుంచి పబ్లిక్ గానే వస్తున్న విమర్శలు.

అధికార వైసీపీ నేతల దోపిడీ చర్యలపై మరో సంఘటన ఇప్పుడు మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బాలికతో వ్యభిచారం చేయించారనే కేసులో గుంటూరులోని అరండల్ పేట పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ ఐదుగురు నిందితుల్లో వైసీపీలో ఉన్న ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావు ఉడడం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. కరోనా బారిన పడిన తల్లీ కూతురు జీజీహెచ్ లో చేరారు. చికిత్స పొందుతూ తల్లి తనువు చాలించింది. కరోనా పూర్తిగా నయం కావాలంటే నాటు వైద్యం చేయిస్తానని జీజీహెచ్ లో పరిచయమైన ఓ మహిళ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పింది. ఆమెను నమ్మిన తండ్రి తన కూతుర్ని ఆ మాయ లేడి వెంట పంపించాడు.

కరోనా తగ్గిన తర్వాత ఆ బాలికను ఆ కిలాడీ వ్యభిచారంలోని దింపింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ లాంటి చోట్ల వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలో విజయవాడలో తప్పించుకున్న ఆ బాలిక పేరేచర్లలో ఉన్న తండ్రి వద్దకు చేరుకుని, మేడికొండూరు పీఎస్లో ఫిర్యాదు చేసింది.  బాలిక ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అరండల్ పేటకు కేసును బదిలీ చేశారు.  అరండల్ పేట పోలీసుల విచారణలో ఈ వ్యభిచార ముఠాలో 45 మంది హ్యాండ్ ఉన్నట్లు తేలింది. వారిలో వైసీపీ నేత ముఖ్య అనుచరుడు, నిజాంపట్నానికి చెందిన కన్నా భూశంకరరావు, మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

భూశంకరరావు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ అనుచరుడే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఎన్ని నేరాలు చేసినా జగన్ రెడ్డి కాపాడతారనే ధైర్యంతోనే వైసీపీ నేతలు అకృత్యాలకు బరితెగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘యధా లీడర్.. తథా కేడర్’ అంటూ సీఎం జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవితో కలిసి భూశంకరరావు ఉన్న ఫొటోను లోకేశ్ తన ట్వీట్ కు జతచేశారు.

ఇప్ప‌టికే కేసినో దందా ఏపీలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తెలుగు ప్రజలకు అస్సలు అవగాహన, అలవాటు లేని కెసినో సంస్కృతిని దిగుమతి చేసి, పండగ పేరుతో కోట్లాది రూపాయలు జనం నుంచి గుంజుకున్నదీ ఆ సర్కార్ లోని మంత్రివర్యుడే అని మీడియా, ప్రతిపక్షం టీడీపీ కోడై కూస్తోంది. అఫ్ కోర్స్..! కెసినో తన రెండున్నర ఎకరాల కే కన్వెన్షన్ లో నిర్వహించినట్లు నిరూపిస్తే.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ ప్రబుద్ధుడు మేకపోతు సవాల్ కూడా చేశారనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కెసినో కంపు మీద కయ్యం బాగా ముదిరిపోతోంది. ఇలాంటి స‌మ‌యంలో వ్య‌భిచార‌-మ్ లాంటి నీచ ప్ర‌వృత్తికీ తెగిస్తుండ‌టం మ‌రింత దారుణం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నేతలు ఇంకెంత కింది స్థాయికి దిగజారుస్తారో అనే ఆందోళన పలువరి నుంచి వ్యక్తం అవుతోంది. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై ముఖ్య నేత స్పందన ఎలా ఉంటుందనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. అక్రమంగా కెసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని, అసలు కేబినెట్ నుంచే బర్తరఫ్ చేయాలని టీడీపీ నేతలు గవర్నర్ ను డిమాండ్ చేస్తున్నారు. బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో అరెస్టయిన భూశంకరరావును టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు కాపాడతారో? లేక చర్యలు తీసుకుంటారో?