ఐదో వికెట్.. రెహానే ఔట్

 

భారత క్రికెట్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. రెహానె 68 బంతులలో 44 పరుగులు చేసిన రెహానె‌ని స్టార్క్ ఔట్ చేశాడు. ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్న టీమ్ ఇండియా ఐదో వికెట్ కూడా కోల్పోయే సరికి ఇక ఓటమి తప్పదన్న విషయం క్లియర్ అయిపోయింది. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా గెలుస్తూ వచ్చిన ఇండియా జట్టు ఇప్పుడిలా ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసే దిశగా వెళ్తోంది.. ఇంకా కెప్టెన్ ధోనీ కూడా ఔటయితే ఇక అంతే సంగతులు.. చిత్తగించవలెను.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu