పశ్చిమ వైసీపీలో రాయుడు వర్సెస్ నాయుడు

పశ్చిమగోదావరి జిల్లా వైసీపీలో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆళ్ల నాని మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని, వీళ్లిద్దరికీ అస్సలు పడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి రాకముందు పశ్చిమ వైసీపీకి అంతా తానై వ్యవహరించిన ఆళ్ల నాని... ఇప్పుడు గుర్రుగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లితో పలువురికి పొసగడం లేదని,  గత ఎన్నికల్లో ఓడిపోయిన గ్రంథి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వర్రావు లాంటి వాళ్లు తీవ్ర అసంతప్తితో ఉన్నారని, ఏదోఒక పార్టీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు. జగన్ చేసిన తప్పిదాలతో 2014లో కోలుకోలేని దెబ్బతింటే, పార్టీని బతికించుకోవాల్సిన నేతలు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు