టీడీపీలోకి ఆదినారాయణరెడ్డి, వైసీపీలోకి రామసుబ్బారెడ్డి?

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ చేరాలని నిర్ణయించుకోవడంతో అతని రాజకీయ ప్రత్యర్ధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది, ఆదినారాయణరెడ్డి రాకపై రామసుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ చంద్రబాబు, చినబాబు... పట్టించుకోలేదని, దాంతో చేసేదేమీ లేక....జగన్ పార్టీతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే, రామసుబ్బారెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.