వెనక్కి తగ్గిన విష్ణు దూసుకేల్తా

 

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం "దూసుకేల్తా". వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ రాష్ట్రంలో ఉద్యమాల ప్రభావాల వల్ల ఈ చిత్రాన్ని అక్టోబర్ 17కి వాయిదా వేసినట్లు సమాచారం. మరి ఈ ఉద్యమ సెగకు ఈ చిత్రం ఇంకేంతవరకు వెనక్కి వెళ్తుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రంలో విష్ణు సరసన "అందాల రాక్షసి" ఫేం లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu