రాజీవ్ ఖేల్రత్నకు కోహ్లీ నామినేట్
posted on Sep 17, 2018 5:36PM
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుకు సిఫార్సు చేశారు.. టీమిండియా కెప్టెన్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో నంబర్ వన్ బ్యాట్స్మన్ అయిన కోహ్లీ పేరును 2016లో ఖేల్రత్న అవార్డు కోసం పరిశీలించారు.. అయితే అప్పుడు సెలక్షన్ కమిటీ ఆయన పేరును పక్కనబెట్టింది.. తాజాగా మరోసారి కోహ్లీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది.. ఈసారి సెలక్షన్ కమిటీ కూడా కోహ్లీని ప్రతిపాదించింది.. ఈ ప్రతిపాదనకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ కూడా ఆమోదం తెలిపితే, ఈ అత్యున్నత పురస్కారం అందుకునే మూడో క్రికెటర్గా కోహ్లీ నిలుస్తాడు.. గతంలో సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ ఖేల్రత్న అందుకున్నారు.. అదే విధంగా గతేడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో 48కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను పేరును కూడా కోహ్లీ పేరుతో పాటు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది.