జగన్ పాదయాత్ర.. సీబీఎన్ ఆర్మీ ఫ్లెక్సీల మోత..!!
posted on Sep 17, 2018 3:38PM
నాయకుడు యాత్రలు, పాదయాత్రలు చేసేటప్పుడు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు పెట్టడం కామన్.. కానీ వెరైటీగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా టీడీపీకి చెందిన సీబీఎన్ ఆర్మీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.. ఫ్లెక్సీ లు అంటే అవేదో వెల్కమ్ ఫ్లెక్సీలు అనుకునేరు.. జగన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల ఫ్లెక్సీలు.. ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర త్వరలో విజయనగరం జిల్లా చేరుకోనుంది.. ఈ నేపధ్యంలో లక్కవరపుకోటలో జగన్ అవినీతి, అక్రమాల క్లిప్పింగ్లతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరక ముందు వైఎస్ జగన్, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై చేసిన విమర్శలకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్లతో రూపొందించిన భారీ ఫ్లెక్సీలను ఒక వరుసలో ఎగ్జిబిషన్ తరహాలో ఏర్పాటుచేశారు.. ఈ ఫ్లెక్సీల ఎగ్జిబిషన్ ను ఆ మార్గంలో వచ్చిపోయేవారంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.. అంతేకాదు టీడీపీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీబీఎన్ ఆర్మీ దళం ఇక ముందు కూడా ఈ తరహా ఫ్లెక్సీల ప్రచార పోరాటం కొనసాగిస్తుందని తెలుస్తోంది.