మాల్యా రేపు జనానికి కనిపించబోతున్నారు..!

బ్యాంకులకు దాదాపు రూ.9 వేలకోట్లకు పైగా ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా అప్పటి నుంచి జనానికి కనిపించలేదు. మొన్నామధ్య బుక్ ఓపెనింగ్‌కు హాజరైనట్టు ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా ప్రపంచానికి కనిపించబోతున్నారు. రేపు జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా..ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్ 1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నారు.