జెట్ ఎయిర్‌వేస్‌ బ్రేక్ ఫాస్ట్‌లో బొద్దింక..ప్రయాణికుడికి అస్వస్థత

నాణ్యమైన సేవలకు పేరు పొందిన విమాన సేవలు సైతం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చెడ్డపేరును మూటకట్టుకంటున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ముంబయి నుంచి రాజ్‌కోట్‌కు ప్రయాణించిన ఓ బిర్జుసల్లా అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతనికి ఎయిర్‌లైన్స్ సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్‌‌గా పరోటా, చెనా మసాలా ఇచ్చారు. దీనిలో బొద్దింక ఉండటంతో దీనిని సిబ్బంది గానీ..ప్రయాణికుడు గానీ గమనించకపోవడంతో దానిని తిన్న అతను అస్వస్థతకు గురయ్యాడు. కనీసం అతనికి వైద్యసాయం అందించకపోగా, వేరే ఆహారం ఇస్తామంటూ క్షమాపణలు చెప్పడంతో బిర్జు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జెట్ ఎయిర్‌వేస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.