ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకయ్య

ఎన్డీఏ పక్షాల తరపున ఉప రాష్టపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు చెందిన నేతలు వెంటరాగా వెంకయ్య ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పేపర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలతో పాటు కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, సుజనా చౌదరి, సురేష్ ప్రభు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.