ఏపీలో ముందస్తు ఎన్నికలు పుకార్లే-వెంకయ్యనాయుడు

ఏపీలో 2019కి బదులు 2018లోనే ఎన్నికలు వస్తాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏ రాష్ట్రానికీ ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను భావించడం లేదన్నారు..పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఎన్నికలు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న ఆలోచన అమల్లోకి రావడానికి ఎంతోకాలం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రేపటి నుంచి అమల్లోకి రానున్న స్థిరాస్తి నియంత్రణ చట్టంపై మాట్లాడుతూ ఇక నుంచి కొనుగోలు దారుడే నిర్మాణరంగంలో రారాజన్నారు. సొంత ఇంటి కోసం చాలా మంది..ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారని..కొత్త చట్టం ద్వారా స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నట్లు వెంకయ్య చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu