భారత్... ఏపీ వైపు చూస్తోంది-వెంకయ్య

 

అభివృద్ధి విషయంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు, అమరావతి శంకుస్థాపన వేదికపై నుంచి మాట్లాడిన వెంకయ్య... ప్రపంచంలోనే అద్భుత రాజధానిగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు, అభివృద్ధిలో ప్రజలంతా భారతదేశం వైపు చూస్తుంటే, భారత్ మాత్రం హైదరాబాద్ వైపు, ఏపీ వైపు చూస్తుందని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్... పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో పోటీ పడాలన్న వెంకయ్యనాయుడు....పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు ప్రజలంతా కలిసుండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ ఒక వేదిక పైకి రావడం సంతోషకరమని, కేసీఆర్, చంద్రబాబులు ప్రజలకు మంచి మార్గాన్ని చూపారని అన్నారు. ప్రభుత్వం, ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ రాజధాని నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు వెంకయ్యనాయుడు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu