తీరాన్ని తాకిన వార్ధా..చెన్నైలో బీభత్సం

అతి తీవ్ర తుఫానుగా మారిన వార్థా చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురుస్తోంది. గంటకు 120-140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల కారణంగా వేలాది వృక్షాలు, స్థంభాలు, హోర్డింగులు విరిగిపడుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుఫాను కారణంగా ప్రజారవాణా పూర్తిగా స్తంభించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu