ఒకపక్క మాథుర్ లో హింసాత్మక ఘటనలు... మరోపక్క హేమమాలిని ఫొటోలు

 

బాలీవుడ్ డ్రీమ్ గాళ్, ఎంపీ హేమమాలిని అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు మాథుర్ ఘటనలో కూడా ఆమె ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మథురలోని జవహార్ భాగ్ ప్రాంతంలో అక్రమణలను తొలగించేందుకు వచ్చిన పోలీసులపై అక్రమణదారులు తుపాకులు, గ్రానైడ్లతో దాడి చేయడంతో ఎస్పీతో సహా.. పలువురు మృతి చెందారు. అయితే ఒకవైపు అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగుతుంటే హేమమాలిని తన సినిమా షూటింగ్ కు సంబంధించిన పొటోలను అప్ లోడ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక అంతే హేమమాలిని చేసిన ఈ పనికి ఆమెపై విమర్శల బాణాలు విసురుతున్నారు. ఇక అంతా అయిపోయిన తరువాత జ్ఞానోదయం అయిన హేమమాలిని ఆఖరికి ఫొటోలు తీసేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu