ఎపికి పొంచి ఉన్న అసాని తుఫాను

ఏపీకి తుఫాను గండం పొంచి ఉంది. ఈ విషయాన్ని  వాతావరణ శాఖ ధ్రృవీకరించింది.. విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన అసాని తుఫాన్‌ మరో 6 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాంలో రెండ్రోజులపాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత మార్చిలో భారీ తుఫానుతో ఎపి అతలాకుతలం అయ్యింది. అప్పట్లో భారీ విధ్వంసం, ఆస్తి నష్టం జరిగింది. 
 తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తీవ్ర వాయుగుండం మరింత శక్తిని పుంజుకుని తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుఫాను పేరు అసానిగా నామకరణం చేసింది శ్రీలంక. తమిళభాషలో అసాని అంటే రౌద్రం. అసాని ఈ సాయంత్రానికి తుపానుగా మారి... ఉత్తర వాయవ్య దిశలో బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని తెలిపింది. ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ తీరంలో ఖేపుపారా-చిట్టగాంగ్ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముందని ఐఎండీ వివరించింది. 
కాగా, విశాఖ వాతావరణ కేంద్రం కూడా దీనిపై అప్ డేట్ అందించింది. కోస్తాంధ్రలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఎపిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.