12 ఎమ్మెల్సీ స్థానాలు.. 6 కైవసం చేసుకున్న టీఆర్ఎస్
posted on Dec 12, 2015 12:12PM

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండురోజులకు గాను నాలుగు ఎమ్మెల్సీ స్ఠానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్. ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలను సైతం తన ఖాతాలో వేసుకుంది. కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లు వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు ఉపసంహరించుకోవడంతో టీఆర్ఎస్ ఈ స్థానాలను సొంతం చేసుకుంది. కాగా ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పురాణం సతీష్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి భూపాల్ రెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి గాను కొండా మురళీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానం కూడా సొంతం చేసుకున్నారు. మొత్తానికి 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుని ప్రతిపక్షాలకు చెమటలు పటిస్తుంది. ఇక మిగిలిన ఆరు స్థానాల్లో ఎన్ని టీఆర్ఎస్ కి వస్తాయో.. ఎన్ని ప్రతిపక్ష పార్టీలకు వెళతాయో చూడాలి.