కేసీఆర్ విజయవాడ షెడ్యూల్.. స్వకార్యం.. స్వామికార్యం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి విజయవాడలో అడుగుపెట్టనున్నారు. దక్షిణ రాష్ట్రాల మండలి సమావేశం నేపథ్యంలో ఆయన విజయవాడ రానున్నారు. మొదట ఈ సమావేశానికి రావాలా.. వద్దా అని ఆలోచించిన కేసీఆర్.. సీఎంల కమిటీకి వైస్ చైర్మన్ హోదాలో ఉన్నందున వెళ్లాలని డిసైడయ్యారు. అయితే కేసీఆర్ విజయవాడకు రావడం వల్ల ఈ సమావేశానికి మాత్రమే కాదు తన వ్యక్తిగత పనులకు కూడా ఉపయోగపడుతుందని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారంట. విజయవాడ వచ్చి మొదట సమావేశంలో పాల్గొని ఆతరువాత.. తను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి చంద్రబాబు ను ఆహ్వానించడం.. అనంతరం తెలంగాణ రాష్ర్టం సిద్ధిస్తే చెల్లించుకుంటానన్న మొక్కులను చెల్లించుకోవడం.. తదితర స్వకార్యాలకు టూర్ ఫిక్స్ చేసుకున్నారు. మొత్తానికి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న నేపథ్యంలో.. ఒకే టూర్లో తన స్వకార్యాలు.. స్వామికార్యాలు పూర్తి చేసుకోనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu