కళ్యాణలక్ష్మి పథకం బీసీ, ఈబీసీలకు కూడా.. టీ సర్కార్

 

తెలంగాణ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం  బీసీ, ఈబీసీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు కళ్యాణలక్ష్మీ పథకం ఉద్దేశం నిరుపేదలైన ఆడబిడ్డల వివాహాలకు రూ.51వేల మంజూరు చేయడమే. అయితే ఈ పథకాన్ని ఈబీసీలకు సైతం పథకం వర్తింప చేయాలంటూ వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో బీసీలకు, వెనుకబడిన ఈబీసీలకు కూడా పథకాన్ని అమలు చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ నెల నుంచి పథకం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.2లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu