బయటపడుతున్న ఐసిస్ అరాచకాలు.. 250 మంది యువతుల తలలు నరికి చంపారు..

 


ఉగ్రవాదులు చేసిన అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇరాక్, సిరియాలో పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ అక్కడి యువతులను దారుణంగా నరికి చంపిన వైనం తాజాగా వెలుగు చూసింది. ఇరాక్ నుండి వివిధ ప్రాంతాలనుండి పట్టుకొచ్చిన దాదాపు 250 మంది యువతులను నిలబెట్టి అత్యంత దారుణంగా నరికి చంపారు. దీనికి సంబంధించి తీవ్రవాద సంస్థ పెద్దలు ఓ ఫర్మానా విడుదల చేశారు. షర్మానా ప్రకారం.. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ తరపున పోరాడుతున్న తీవ్రవాదులను తాత్కాలికంగా పెళ్లి చేసుకుని, సెక్స్ బానిసలుగా పని చేయాలని యువతలను కోరగా.. ప్రాణం పోయినా దానికి అంగీకరించమని చెప్పడంతో వారందరినీ వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే తలలు నరికి చంపారు. వారినే కాదు తమ పిల్లలను పంపించని తల్లిదండ్రులను కూడా ఇదే రకంగా హతమార్చినట్టు ఆయన వెల్లడించారు.