ఇకపై మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు..

 


భారత రైల్వే శాఖ రైలు టికెట్ల విషయంలో పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తత్కాల్ టికెట్ల విషయంలో కొన్ని మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే విధంగా కొన్ని మార్పులు చేయనుంది. దీనిలో భాగంగానే రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉండేది. అయితే అది కేవలం రైలు కదిలే మూడు నాలుగు గంటల ముందులోపే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇకపై టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా, ఆర్ఏసీ లో ఉన్నా139 నంబరుకు ఫోన్ చేసి.. ఫోన్ ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా రైలు కదిలే అరంగంట ముందు వరకూ టికెట్లను రద్దు చేసుకునేలా మార్పు చేశారు. అంతేకాదు టికెట్ కౌంటర్ లో టికెట్ కొన్నా కానీ  ఫోన్ ద్వారా కూడా తమ టికెట్ ను రద్దు చేసుకోవచ్చు. ఇక టికెట్ రద్దు అయిన తరువాత వివరాలనుబట్టి నగదు చేతికి అందుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu