తిరుమల టోల్ గేట్ వద్ద కారులో మంటలు .. భక్తుడు క్షేమం

 

 తిరుమలలోని GNC టోల్ గేట్ సమీపంలో ఒక కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. బెంగళూరులోని ముళబాగిలుకు చెందిన సుదర్శన్ అనే భక్తుడు తన కారులో తిరుమల చేరుకున్నారు. అతను టోల్ గేట్ వద్దకు చేరుకునేసరికి, సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగాయి. టిటిడి  భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి  కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్‌తున్నారు . హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.