ఏవోబీ.. మళ్లీ ఎదురు కాల్పులు.. ముగ్గురు మృతి

 

ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు) నిన్నటి నుండి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. నిన్నజరిపిన కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈరోజు మళ్లీ ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ రోజు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 27కు చేరింది. మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలోని రామ్‌గఢ్-పనస్‌పుట్ సమీపంలోనే తాజా ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల మృతదేహాలకు రాత్రే పోస్టుమార్టం పూర్తయిందని.. మృతదేహాలు మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో ఉన్నాయని.. బంధువులు వస్తే మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఒకవేళ మృతదేహాలను ఏపీ, తెలంగాణకు తరలిస్తే ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.