కాపురానికి  నో చెప్పిన భార్య..  బ్లేడ్‌తో గొంతు కోసుకున్న భర్త..  

ఈ మధ్య కొంత మందికి ప్రాణం అంటే లెక్కలేకుండా పోయింది. ప్రతి చిన్న విషయానికి ప్రాణం తీసుకుంటున్నారు.. లేదంటే పర్ణాలు తీస్తున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లా తాండూర్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో జరిగింది. 

కర్ణాటక రాష్ట్రంలోని గురుకుంటకు చెందిన ఒక వ్యక్తి. అతని పేరు  అడిగి సంగమేశ్వర్. అతను తన భార్యతో కలిసి ఎన్టీఆర్ కాలనీలో గత కొంతకాలంగా నివాసముంటున్నాడు. ఈ ప్రాంతంలోనే పాలిసింగ్ యూనిట్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంగమేశ్వర్‌కు, తన భార్యకు మధ్య గొడవ జరిగింది. దీంతో తన భార్య ఆమె అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. భార్య భర్తల మధ్య ఎప్పుడు ఉండే చిన్న చిన్న గొడవలే అని ఆమె అనుకోలేదు.. అతను కూడా అనుకోలేదు..  ఈ క్రమంలో పలుసార్లు  భార్య అక్కా, బావాతో కూడా సంగమేశ్వర్ మాట్లాడాడు. అయినా ఫలితం లేదు. చివరికి  తన భార్య ఇంటికి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

తన భార్యను కాపురానికి పంపించడం లేదంటూ మనస్తాపానికి గురైన సంగమేశ్వర్..ఎప్పుడు గొడవ పడే వాళ్ళు లేకపోతే కూడా మనిషికి భయం వేస్తది కదా.. మరి అతనిది అమాయకత్వం లేదంటే నిజంగానే భార్య అంటే బెంగో తెలియదు గానీ చివరికి  బ్లేడ్‌తో గొంతు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం అయింది. అయితే.. సంగమేశ్వర్‌ను గమనించిన స్థానికులు వెంటనే అతనిని తాండూర్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు.