తెలంగాణ సెక్రటేరియట్ లో దొంగలు పడ్డారు

 

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సెక్రటేరియట్ లో చోరీ జరిగింది, సచివాలయం డి బ్లాక్ లోకి ప్రవేశించిన దొంగలు... అక్కడ ఉండే జనరేటర్ బ్యాటరీని ఎత్తుకెళ్లిపోయారు, ఇవాళ జనరేటర్ బ్యాటరీ లేకపోవడాన్ని గుర్తించిన సెక్రటేరియట్ సిబ్బంది... పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సచివాలయంలో దొంగతనం జరగడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటేరియట్ లో సిబ్బంది సహకారం లేకుండా అసలు లోపలికి ప్రవేశించడమే సాధ్యంకాదని, సచివాలయ సిబ్బంది సహకారంతోనే బయటివాళ్లు లోపలికి వచ్చుంటారని, లేక సిబ్బందిలోనే ఎవరైనా ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu