కోమటిరెడ్డికి పీసీసీ షోకాజ్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో వరుస పరాజయాలకు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కారణమని కోమటిరెడ్డి బహిరంగంగా విమర్శించారు. అంతేకాకుండా పొన్నాల కంటే ఉత్తమ్ వరస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీపీసీసీ క్రమశిక్షాణా సంఘం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu