నారాయణఖేడ్ పై కేసీఆర్ కన్ను పడింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ట్రెండ్ ను బ్రేక్ చేయబోతున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ హఠాన్మరణం చెంది ఉపఎన్నిక జరిగితే, ఆ స్థానంలో ప్రధాన పార్టీలు పోటీపెట్టకుండా, ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఏకగ్రీవమయ్యేటట్లు చూడటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటివరకూ వస్తున్న ఈ ఆనవాయితీని కాదని నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. ఆ బాధ్యతను తన మేనల్లుడు, మంత్రి హరీష్ రావును... కేసీఆర్ అప్పగించారని, ఎలాగైనా నారాయణఖేడ్ ను గులాబీ ఖాతాలో వేయాలని ఆదేశించారట.