మంత్రి మైక్ కట్



ఏపీ శాసనసభలో టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు మైకును స్పీకర్ కోడెల శివప్రాసదరావు కట్ చేశారు. ఈ రోజు సభలో కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టుపైన మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ కల్పించుకొని చర్చను కరవుకు మాత్రమే పరిమితం చేయాలని, మరే ఇతర అంశాన్నీ ప్రస్తావించొద్దన్నారు. ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని అడిగారు. సభాపతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు వెంటనే.. వైయస్ చనిపోయిన తర్వాత వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైయస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అలా అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తుండగా... కోడెల మైక్ కట్ చేసి వ్యక్తిగత విమర్శలు వద్దని సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu