కాసేపట్లో ప్రారంభంకానున్నతెదేపా మహానాడు

తెలుగుదేశం పార్టీ 34 వ మహానాడు కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గండిపేట వేదికగా జరగనునన్న ఈ మహానాడు కార్యక్రమంలో రెండు రాష్ట్రాల నుండి తెదేపా నేతలు భారీగా తరలివస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ యువనేత, కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేశ్, హరికృష్ణ మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ మహానాడు కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ నారా లోకేశ్ దగ్గరుండి చూసుకున్నారు. ఈ మహానాడుకు 20 వేల మంది ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడులో 31 తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిసింది. ఇందులో ఉమ్మడి తీర్మానాలు 7, ఏపీకి సంబంధించి 14, తెలంగాణకు సంబంధించి 10 ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.