తెదేపా మహానాడు.. ఎన్టీఆర్ పెళ్లి శుభలేఖ స్పెషల్ ఎట్రాక్షన్

మూడు రోజుల పాటు జరిగే తెదేపా 34వ మహానాడు ఏర్పాట్లలో ఎన్నో ఆసక్తికర విషయాలు పొందుపరిచారు. మహానాడు వేదికపై ఒకవైపు తెలంగాణకు చెందిన కాకతీయ స్థూపాన్ని ఉంచగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చిహ్నాలు ఉంచారు. రక్త సిబిర ఏర్పాట్లు, ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్ లో ఒక ఫోటో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది తెలుగుదేశ పార్టీ పునాది వేసిన నందమూరి తారకరామారావు పెళ్లి శుభలేఖ. 1942 మే 2న జరిగిన ఎన్టీఆర్ పెళ్లి పత్రికను ఫోటోఎగ్జిబిషన్ లో పెట్టడంతో మహానాడు వచ్చే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికి 24 రకాల వంటకాలతో 35 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu