జయలలితకు కుష్బూ సవాల్..!

 

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత తన నియోజకవర్గమైన ఆర్కేనగర్ నుండి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజకవర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటీ చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పటికే ఈ పోటీపై ఆసక్తి పెరగగా.. ఇప్పుడు కాంగ్రెస్-డీఎంకే కూటమి కూడా ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి కుష్బూను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి అనుకున్నది అనుకున్నట్టు జరిగి.. కుష్బూని కనుక రంగంలోకి దింపితే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu