లక్షమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ.. కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మల్కాజ్ గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లోని లక్షమంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జీవో 58 కింద పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని, రూ. పదివేల కోట్ల విలువైన భూములను పేదలకు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న పేదల కష్టాలు తీరుస్తామని రాబోయే రెండేళ్లలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లను నిర్మిస్తామని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu