రేవంత్ బెయిల్ పిటిషన్ వాయిదా

నోటుకు ఓటు కేసులో అరెస్ట్ అయిన తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఏసీబీ కోర్టు ఈ విచారణను ఈ నెల తొమ్మిదో తేదికి మరోసారి వాయిదా వేసింది. అయితే 8న కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉండగా మరోవైరు ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా విచారణ జరిగింది. ఇరువర్గాల వాదోపవాదనలు విన్న ఏసీబీ జడ్జి తీర్పును సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. అయితే రేవంత్ రెడ్డిని కస్టడీకి అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu