స్వామిగౌడ్ క్షమాపణ చెప్పాలి

 

తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. ముస్లింలను డామినేట్ చేయడానికి హిందువులు నలుగురేసి పిల్లల్ని కనాలని స్వామిగౌడ్ పిలుపు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పలువురు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఈ వ్యాఖ్యలను దుయ్యబట్టారు. ఈ ప్రమాదకర వ్యాఖ్యలను స్వామిగౌడ్ వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఖండించకపోవడాన్ని కూడా నారాయణ తప్పుపట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించకపోతే స్వామిగౌడ్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఆమోదించినట్టు భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu