పట్టాలకు వేలాడే రైలు
posted on Aug 5, 2020 5:53PM
రైలు ఎలా వెళ్ళుతుంది అనగానే.. పట్టాలపై వెళ్లుతుంది అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ, జర్మనీలోని ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైలు గురించి తెలిసిన వారు మాత్రం పట్టాల పైన వెళ్లవచ్చు, పట్టాల కింద వేలాడుతూ కూడా వెళ్ళవచ్చు అని చెప్తారు. పట్టాలకు వేలాడుతూ ప్రయాణికులను వింత అనుభూతులను లోను చేస్తూ వెళ్లే రైలు జర్మనీలో ఉంది. జర్మన్ వెళ్లిన వారు ఈ అద్భుత రైలు ప్రయాణం తప్పక చేస్తారు..
ఉత్తర జర్మనీలోని రైన్-వెస్ట్ఫాలియాలోని ఉప్పర్ నగరం చుట్టూ తిరుగుతూ, పట్టణం అందాలను కనువిందు చేస్తూ సాగే రైలు ప్రయాణం ఇక్కడి ప్రజలను నిత్యానందమే. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చే ఈ ఈ వేలాడే రైలు పూర్తి పేరు ''ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైల్వే (సస్పెన్షన్ రైల్వే). విద్యుత్ చార్జింగ్తో నడిచే రైల్వే సిస్టం ఇది.
ఈ రైలు నిర్మాణానికి 1897లో శంకుస్థాపన జరిగి 1903 నాటికి పూర్తి అయ్యింది. ఈ వేలాడే రైలులో ఏటా ప్రయాణించే వారి సంఖ్య 25 మిలియన్లు అంటే అతిశయోక్తి కాదు. కేవలం ఈ రైలులో ప్రయాణించడానికే అనేక మంది పర్యాటకులు జర్మన్ వెళ్లుతారట. సుమారు 12 మీటర్ల ఎత్తులో ఉండే ఈ రైల్వే ట్రాక్ 13.3 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం ఇరవై రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సుమారు మూడు కిలోమీటర్ల వరకు లోయ పై నుంచి ప్రయాణం సాగుతుంది. పచ్చని ప్రకృతితో లోయ సోగసులు పారదర్శక అద్దాల నుంచి అద్భుత చిత్రంగా కనిపిస్తాయి.
1824లో ఇంగ్లండ్కు చెందిన హెన్రీ రాబిన్సన్ పాల్మెర్ విభిన్నంగా ఉండే ఒక రైల్వే వ్యవస్థ రూపొందించారు. ఈ నూతన నిర్మాణం నచ్చిన సస్పెన్షన్ రైల్వే సంస్థ దీనిని నిర్మాణానికి ముందుకు వచ్చింది. స్థానికులకు అందుబాటులో ఉన్న ఈ రైల్ వే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ నిలిచేది. ఈ రైల్వేను ప్రపంచ యుద్ధం సమయంలో తీవ్ర నష్టం కారణంగా మూసివేశారు. 1946లో కాస్త ఆధునికరించి ప్రయాణికులకు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారట.
కోల్ పరిశ్రమల వెంట, ఉప్పర్ వ్యాలీ చుట్టూ ఉంటే ఈ రైల్వే ట్రాక్ 486 ఫిల్లర్స్ మీదుగా నిర్మించబడింది. ఈ రైల్వేలో ప్రతిరోజూ సగటున ఎనబైరెండు వేల మంది ప్రయాణిస్తారు. 24 మీటర్ల పొడవు ఉండే రెండు బోగీల సముదాయంగా ఈ రైలు ఉంటుంది. నాలుగు డోర్స్ గల ప్రతి క్యాబిన్లో 48 మంది కూర్చోనేందుకు వీలుగా సీట్లు, 130మంది నిలబడే వీలు ఉంటుంది. ఈ రైలులో ప్రయాణం వింత అనుభవంగా పర్యాకులు అభివర్ణిస్తారు. ముఖ్యంగా ఉప్పర్ వ్యాలీపై నుంచి వెళ్లుతూ.. లోయ అందాలను వీక్షించడం మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందంటారు.