కేసీఆర్ నాయినికి షాక్ ఇవ్వనున్నారా

 

టీఆర్ఎస్ ఇంకా రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిల్లో ఒకటి కోదాడ కాగా రెండోది ముషీరాబాద్‌. ముఖ్యంగా ముషీరాబాద్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందా అని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6వ తేదీనే ఈ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాలని భావించినా, నాయిని నర్సింహారెడ్డి అభ్యంతరాలతో ప్రకటన నిలిచిపోయింది. ముషీరాబాద్‌ స్థానాన్ని తన అల్లుడికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వడం కుదరకపోతే తానే పోటీ చేయాలన్న ఆలోచనలో నాయిని ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సీటును గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముఠా గోపాల్‌కే ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. నామినేషన్ల దాఖలు గడువు ముంచుకొస్తుండడంతో ఈరోజు ముషీరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. చూద్దాం మరి కేసీఆర్ ముషీరాబాద్‌ విషయంలో నాయినికి షాక్ ఇస్తారో లేదో.