సుహాసిని నామినేషన్...లోకేష్ రియాక్షన్

 

కూకట్ పల్లి అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరుపున నందమూరి సుహాసిని నామినేషన్ వేశారు.నందమూరి బాలకృష్ణ దగ్గరుండి సుహాసిని చేత నామినేషన్ వేయించారు. సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. తమ అక్కకు మద్దతివ్వాలంటూ ట్విట్టర్‌ ద్వారా ఓటర్లను అభ్యర్థించారు. ఎన్టీఆర్, హరికృష్ణ వారసురాలిగా రాజకీయాల్లోకి వస్తున్న సుహాసినికి నందమూరి,నారా కుటంబాలు అండగా నిలుస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సుహాసినికి మద్దతు కోరుతూ ట్వీట్ చేశారు. ‘‘పేదల పెన్నిధిగా, బడుగు వర్గాలకు ఆత్మీయునిగా సేవలందించిన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రజలు గుండెకు హత్తుకున్న తీరు మరువలేనిది. ఈ గడ్డపై పార్టీ పెట్టిన ఎన్టీఆర్, ఈ గడ్డపైనే అమరులయ్యారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ సైతం తెలంగాణలోనే ఆఖరిశ్వాస తీసుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్, హరికృష్ణల వారసురాలు నందమూరి సుహాసిని, తాతగారి ఆశయాలతో, తండ్రి ఆకాంక్షలతో, మావయ్య చంద్రబాబు గారి ఆశీస్సులతో ప్రజలకు సేవచేసేందుకు ముందుకొచ్చారు. ఆమెను అఖండ మెజారిటీతో గెలిపించి ఎన్టీఆర్, హరికృష్ణలకు అసలైన నివాళి అందించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను.’’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.