కెబిసిలో రూ.5కోట్లు గెల్చుకున్న మహిళ
posted on Jan 6, 2013 2:28PM
ముంబై గృహిణి సుర్మీత్ కౌర్ సౌనీ అత్యంత జనాదరణ పొందిన కౌన్బనేగా కరోడ్పతి షోలో జాక్పాట్ కొట్టేశారు. రూ. 5కోట్లు కైవసం గెలుచుకున్న రెండో పోటీదారుగా ఈమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్కు చెందిన ‘హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్’ టీవీ షో ప్రేరణతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రారంభించిన కౌన్బనేగా కరోడ్పతి దేశంలో అత్యధిక ప్రజానీకం చూస్తున్న టీవీ గేమ్ షోగా పేరొందింది.
గతంలో బీహార్ నివాసి సుశీల్ కుమార్ ప్రప్రధమంగా ఈ పోటీల్లో అయిదు కోట్లు గెలిచిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. నెలకు ఆరువేల రూపాయల వేతనంతో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న సుశీల్ ఈ బంపర్ ప్రైజ్ను గెలుచుకోవడతంతో కోట్లమందికి కరోడ్పతిపై క్రేజీ పెరిగిపోయింది. ఈ షో వచ్చే వారం ప్రసారం కాబోతుంది. ఛండీగఢ్ కు చెందిన ఈ మహిళ ముంబయిలో స్థిరపడింది. ఆమె భర్త హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.