సుబ్రతా రాయ్‌కు నాలుగు రోజుల పెరోల్... తల్లి అంత్యక్రియలకు

 

సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిన్న సుబ్రతా రాయ్‌ తల్లి మరణించిన నేపథ్యంలో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పెరోల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. పెరోల్ సమయంలో ఆయనకు మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలోనే ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సుబ్రతా రాయ్‌తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్‌కి కూడా న్యాయస్థానం నాలుగు వారాల పెరోల్ ఇచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu