రికార్డ్ స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

 

గత రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్లు.. ఈరోజు రికార్డ్ స్థాయిలో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో మొదలైన మార్కెట్లు, సెన్సెక్స్‌ 31,333 నిఫ్టీ  9673 వద్ద  సరికొత్త రికార్డ్‌ స్థాయిలను నమోదు చేశాయి. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 135.70 పాయింట్ల లాభంలో 31,273.29 వద్ద.. నిఫ్టీ 37.40 పాయింట్ల లాభంతో తొలిసారి 9650 మార్కుకు పైన నిలిచింది. హీరో మోటార్ కార్పొ, సిప్లా రెండు సూచీల్లో లాభాలు పండించగా.. గెయిల్, టాటా స్టీల్, బీపీసీఎల్ టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu